Saturday, May 4, 2024

టీడీపీ జోలికొస్తే వైసీపీకి మూడినట్లే: అచ్చెన్న

టీడీపీ శ్రేణుల జోలికొస్తే.. వైసీపీకి మూడినట్లేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. పొలం నాశనం చేయొద్దంటే కేసులు పెడతారా? అంటూ నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా, పెదకూరపాడు మండలం, కంభంపాడు ఘటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాల గుండా విద్యుత్ లైన్లు వేస్తూ.. పొలాలు నాశనం చేస్తే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణంపై కంటే.. ప్రతిపక్షాలను వేధించడంపైనే వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని మండిపడ్డారు. పోలీసులు ఖాకీ చొక్కాతీసి నీలి రంగు పులుముకోవడం బెటరన్నారు. అరెస్టు చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల సీఎంల తీరుతో నష్టం.. కేంద్రానికి బండి సంజయ్ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement