Friday, May 3, 2024

కొత్తగా 16,167 కరోనా కేసులు.. 41 మంది మృతి

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడం లేదు. రోజురోజుకు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా.. దేశంలో 16,167 కరోనా కేసులు నమోదవగా.. 41 మంది కరోనా మహమ్మారితో చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,41,61,899కి చేరాయి. ఇందులో 4,34,99,659 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,730 మంది మృతిచెందారు. మరో 1,35,510 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు మరో 41 మంది కరోనాకు బలవగా, 15,549 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. కరోనా కేసులు భారీగా పెరగడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 6.14 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement