Thursday, April 25, 2024

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం.. సూర్యాపేట జిల్లాలో ఘ‌ట‌న‌

సూర్యాపేట, (ప్రభన్యూస్) : ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసింది. తన చెల్లెని ప్రేమిస్తున్నాడ‌న్న‌ కోపంతో దోస్తుల‌తో కలిసి ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న సూర్యాపేట‌లో ఆదివారం రాత్రి జ‌రిగింది. మినీ టాంక్ బండ్ కట్టపై యువ‌కుడిని కిరాతకంగా చంపారు. ఆ త‌ర్వాత‌ నలుగురు నిందితులు పట్టణ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం..

మరో శవం కలకలం
ప్రేమ వ్యవహారంతో మినీ టాంక్ బండ్ పై యువకుడి మృతదేహం చర్చనీయం కాగా సద్దుల చెరువులో మరో డెడ్‌బాడీ క‌నిపించ‌డం సూర్యాపేట‌లో కలకలం రేపుతోంది. మృతుడు పట్టణానికి చెందిన మొర సైదులుగా పోలీసులు గుర్తించారు. సైదులు మృతికి గ‌ల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement