Tuesday, April 30, 2024

చెన్నూరులో 100 కేసీఆర్ గ్రంథాలయాలు

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని 100 గ్రామాల్లో కేసీఆర్ గ్రంథాలయాలను నిర్మించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. గ్రంథాలయానికి సంబంధించిన నమూనాను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక్కో గ్రంథాలయానికి నాలుగు లక్షల రూపాయల చొప్పున 100 గ్రామాలకు గాను నాలుగు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. గ్రంధాలయాలు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని, ఈ రోజుల్లో నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా కాంపిటేటివ్ పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని బాల్క సుమన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement