Saturday, April 20, 2024

100 కేసీఆర్ గ్రంథాలయాలు.. 4 కోట్లతో నిర్మిస్తున్నాం: బాల్క సుమన్

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని 100 గ్రామాల్లో కేసీఆర్ గ్రంథాలయాలను నిర్మించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. గ్రంథాలయానికి సంబంధించిన నమూనాను ఈరోజు రిలీజ్‌ చేశారు.

అనంతరం మాట్లాడుతూ ఒక్కో గ్రంథాలయానికి 4 లక్షల రూపాయల చొప్పున 100 గ్రామాలకు గాను 4 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రంధాలయాలు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని, ఈ రోజుల్లో నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా కాంపిటేటివ్ పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement