Thursday, April 18, 2024

అక్రమ సంబంధమే ప్రాణం తీసిందా…?

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామంలోని వ్యవసాయ పొలంలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ఈ రోజు ఉదయం పొలం పనులకు వెళ్లిన వారు పొలంలో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బురదలో నుండి బయటికి తీశారు.

అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు లక్కవరం గ్రామానికి చెందిన బాతుక మహేష్ (30)గా గుర్తించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…మృతుడు బాతుక మహేష్ నిన్న సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై లింగగిరి వెళ్లివస్తానని ఇంటి నుండి బయలుదేరాడు. అయితే, ఇంటి నుండి వెళ్లిన మహేష్ రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. తెల్లవారేసరికి పొలంలో శవమై తేలడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహేష్ కి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య హత్యచేసి పొలంలో పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసుల విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement