Monday, April 29, 2024

వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో అజింక్య రెహానే, శ్రీక‌ర భ‌ర‌త్

ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్ కోసం బీసీసీఐ ఇండియ‌న్ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఐపిఎల్ టి 20 మ్యాచ్ ల‌లో అద‌ర‌గొడుడున్న అజింక్య ర‌హానే తిరిగి జాతీయ టెస్ట్ జ‌ట్టులో అనూహ్యంగా స్థానం పొందాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ గాయ‌ప‌డ‌టంతో తిరిగి టెస్ట్ జ‌ట్టులోకి రెహానాకు చోటు క‌ల్పించారు.. ఇక పేల‌వ‌మైన ఫామ్ లో ఉన్న సూర్య‌కుమార్ యాద‌వ్ కు ఉద్వాస‌న ప‌లికారు.. ఇక ఇద్ద‌రు తెలుగు వాళ్ల‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ టీమ్ లో స్థానం ద‌క్కింది. స్పీడ్ స్ట‌ర్ సిరాజుద్దీన్, కీప‌ర్ బ్యాట్స్ మెన్ శ్రీక‌ర భ‌ర‌త్ లో జ‌ట్టులో చేరారు.. ఈ ఫైన‌ల్స్ లండ‌న్‌లోని ఓవ‌ల్ మైదానంలో జూన్ 7వ తేదీ నుంచి 11వ తేది వ‌ర‌కు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది.. 12వ తేదీన రిజ‌ర్వ్ డే.

భార‌త జ‌ట్టు రోహిత్ శ‌ర్మ‌, శుభ‌మ‌న్ గిల్‌, చ‌తేశ్వ‌ర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింక్య ర‌హానే, కేఎల్ రాహుల్‌, కేఎస్ భ‌ర‌త్‌, ర‌విచంద్ర అశ్విన్‌, ర‌వీంద్ర జడేజా, అక్ష‌ర్ ప‌టేల్‌, శార్దూల్ ఠాకూర్‌, ష‌మీ, సిరాజ్‌, ఉమేశ్ యాద‌వ్‌, జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్ ఉన్నారు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ జూన్ ఏడు నుంచి 11 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement