Wednesday, May 15, 2024

ఫోన్ పేలి.. ఎనిమిదేళ్ల చిన్నారి మృతి

ఈ మ‌ధ్య‌కాలంలో ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. కాగా మొబైల్ ఫోన్ తో ఆడుకుంటుండ‌గా ఫోన్ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది.ఈ సంఘ‌ట‌న కేర‌ళ‌లో చోటు చేసుకుంది. కేరళలోని తిరువిల్వమల నివాసి ఆదిత్యశ్రీ మొబైల్‌ ఫోన్‌తో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. ఆదిత్యశ్రీ స్థానిక పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement