Saturday, April 27, 2024

ఎన్‌సీఎ చీఫ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌

టీమిండియా మాజీ స్పెషలిస్ట్‌ బ్యాటర్‌, హైదరాబాదీ వీవీఎస్‌ లక్ష్మణ్‌ సోమవారం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఎ) హెడ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఎన్‌సీఎ కార్యాలయంలో మొదటిరోజు తన కార్యకలాపాలకు సంబంధించిన ఫొటోను టిటర్‌లో షేర్‌ చేశాడు. కొత్త సవాలును ఎదుర్కొని భారత క్రికెట్‌ భవిష్యత్తు కోసం కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని టీట్‌ చేశాడు. కాగా గత నెలలోనే భారత మాజీ బ్యాటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎన్‌సీఎ అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ధ్రువీకరించాడు. లక్ష్మణ్‌కు ముందు జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌గా బాధ్యతలు నెరవేర్చిన ద్రవిడ్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌గా నియమితుడైన సంగతి విదితమే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement