సౌతాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. భారత పరిమిత ఓవర్ల కెప్టెన్, టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్శర్మ ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు. ముంబైలోని నెట్సెషన్లో రోహిత్ చేతికి గాయమైంది. ఈ నేపథ్యంలో ఇండియా ఎ జట్టు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ను దక్షిణాఫ్రికా టూర్కు సిద్ధంగా ఉండాలని బీసీసీఐ తెలిపింది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర రఘు చేతిలో రోహిత్ గాయపడ్డాడు. డిసెంబర్ 26నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా టూర్కు హిట్మ్యాన్ అందుబాటులో ఉంటాడని అధికారులు వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం టీమిండియా ముంబైలోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో క్వారంటైన్లో ఉంది. మూడు రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత చార్టర్ విమానంలో జోహన్స్బర్గ్ చేరుకుంటుంది. అక్కడ మరో వారం రోజులు క్వారంటైన్లో భారతజట్టు గడపనుంది. క్వారంటైన్ తర్వాత ఐదురోజులపాటు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొని డిసెంబర్ 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital