Saturday, April 27, 2024

ఇషాన్ తో కలిసి డ్యాన్స్ చేసిన కోహ్లీ.. వైరల్ గా వీడియో

శ్రీలంకతో రెండో వన్డే ముగిసిన తర్వాత క్రికెటర్ విరాట్ కోహ్లీ తనలోని డ్యాన్సర్ ని నిద్రలేపాడు..కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ ముగిసిన తర్వాత లేజర్ లైటింగ్ షోను ఏర్పాటు చేయగా.. యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ తో కలిసి కోహ్లీ హుషారుగా డ్యాన్స్ చేసి అందరినీ ఆకర్షించారు. వీరిద్దరూ పోటాపోటీగా స్టేప్పులు వేయగా స్టాండ్స్ లోని ప్రేక్షకులు గట్టిగా అరుస్తూ వాళ్లను ఉత్సాహపరిచారు. ఇద్దరి నృత్యాన్ని తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు నెట్ లో వైరల్ గా మారాయి. కాగా, రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో శ్రీలంకను భారత్ ఓడించింది. దాంతో, మూడు వన్డేల సిరీస్ ను 2–0తో గెలిచింది. ఇరు జట్ల మధ్య చివరి, మూడో వన్డే ఆదివారం తిరువనంతపురంలో జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement