Monday, May 6, 2024

Sports: థామస్‌ కప్‌ టోర్నీ.. భారత్‌ షట్లర్స్‌ శుభారంభం

థామస్‌ కప్‌ టోర్నీలో భారత్‌ శుభారంభం చేసింది. పురుషుల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు లక్ష్యసేన్‌ ప్రత్యర్థిని మట్టికరిపించాడు. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో బ్రాంజ్‌ మెడల్‌ గెలిచిన లక్ష్యసేన్‌.. వరల్డ్‌ నెంబర్‌ 64 ఆటగాడు మ్యాక్స్‌ను 21-16, 21-13 పాయింట్ల తేడాతో రెండు వరుస సెట్స్‌లో విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ రాంకీరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ.. జోన్స్‌, మార్విన్‌ ద్వయాన్ని 21-15, 10-21, 21-13 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

వరల్డ్‌ 11వ నెంబర్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌.. కై చాఫర్‌పై 18-21, 21-9, 21-11 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. అదేవిధంగా అర్జున్‌, ధ్రువ్‌ కపిల జోడీ.. గెయిస్స్‌, కొలిన్‌ ద్వయాన్ని 25-23, 21-15 పాయింట్ల తేడాతో రెండు వరుస సెట్స్‌లో గెలుపొందింది. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 21-9, 21-9 పాయింట్ల తేడాతో మాథియాస్‌ను మట్టికరిపించాడు. ఈ టోర్నీలో భారతీయ క్రీడాకారులు అద్భుతమైన శుభారంభాన్ని అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement