Tuesday, May 14, 2024

టీమిండియా వెస్టిండీస్‌ టూర్‌, కెప్టెన్‌గా శిఖర్​ ధావన్‌.. సీనియర్లకు రెస్ట్​

వెస్టిండీస్‌ పర్యటనకు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. జులై 22 నుంచి ప్రారంభం కానున్న విండీస్‌ టూర్‌లో భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌తో పాటు ఐదు టీ20ల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం టీమిండియా కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. గతంలో శ్రీలంకతో సిరీస్‌ నేపథ్యంలో శిఖర్‌ ధావన్‌ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వైస్‌ కెప్టెన్‌ రవీంద్ర జడేజాకు బాధ్యతలు అప్పగించారు. మొత్తం 16 మంది సభ్యులతో జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌కు టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు సీనియర్లు విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, రిషబ్‌ పంత్‌లకు విశ్రాంతినిచ్చింది. ఇక ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో రాణించిన దీపక్‌ హుడాను కూడా విండీస్‌ టూర్‌కు ఎంపిక చేసింది. రిషబ్‌ పంత్‌కు విశ్రాంతినివ్వడంతో సంజూ శాంసన్‌ వికెట్‌ కీపర్‌గా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడితోపాటు ఇషాన్‌ కిషన్‌ను కూడా జట్టులోకి తీసుకున్నారు. రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనర్లుగా, మిడిలార్డర్‌ బాధ్యతలు సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ మోయనున్నారు. స్పిన్నర్లుగా యజువేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌లను ఎంపిక చేయగా, అవేశ్‌ ఖాన్‌, ప్రసిధ్‌కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, అర్షదీప్‌ సింగ్‌లు పేసర్లుగా ఉండనున్నారు. ఉమ్రాన్‌ మాలిక్‌తోపాటు ఐర్లాండ్‌ సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్‌ పాండ్యాకు విండీస్‌తో వన్డే సిరీస్‌లో చోటు దక్కలేదు. వన్డే సిరీస్‌ మ్యాచ్‌లన్నీ ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లోనే జరుగనున్నాయి. ఆ తర్వాత టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది.

భారత జట్టు: శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, యజువేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌, ప్రసిధ్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, అర్షదీప్‌ సింగ్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement