Wednesday, May 8, 2024

Breaking: ఉత్కంఠ మ్యాచ్​లో లంకను వరించిన విజయం.. పోరాడి ఓడిన భారత్​!

ఆసియా కప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక జట్టు తొలుత 100 పరుగుల వరకు బాగానే ఆడింది. ఇక ఇండియా పని ఖతం అనుకున్నారు అందరూ.. కానీ, ఆ తర్వాత మ్యాజిక్​ జరిగినట్టు వరుసగా వికెట్లు పోగొట్టుకుంది శ్రీలంక. అశ్విన్ వేసిన 14వ ఓవర్లో దనుష్క గుణతిలక అవుటయ్యాడు. అశ్విన్ డెలివరీని భారీ షాట్ ఆడేందుకు యత్నించిన గుణతిలక రాహుల్‌కు చిక్కాడు. దీంతో శ్రీలంక జట్టు మూడో వికెట్ కోల్పోయింది.

గుణతిలక అవుటవడంతో క్రీజులోకి రాజపక్స వచ్చాడు. అర్ధశతకంతో అదరగొట్టిన మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ (57)ను చాహల్ అవుట్ చేశాడు. చాహల్ వేసిన 15వ ఓవర్ తొలి బంతికే ఎల్బీగా అతను పెవిలియన్ చేరాడు. శ్రీలంక రివ్యూ కోరినా ఫలితం మారలేదు. ఇక నాలుగు వికెట్లు కోల్పోయిన లంక భానుక రాజపక్స, దాసున్​ సనుక మెరుగుదిద్దడానికి ట్రై చేశారు. ఈ క్రమంలో ఒకే ఓవర్​లో రెండు సిక్సులు బాదారు.  ఆ తర్వాత 19వ ఓవర్​లోనూ వరుసగా రెండు ఫోర్లు బాది గెలుపు ఈజీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement