Monday, April 29, 2024

Sports | సాత్విక్‌, చిరాగ్‌ జోడీకి 3వ ర్యాంక్‌

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌ సాధించారు. ఇండోనేషియా ఓపెన్‌లో తొలి సూపర్‌ 1000 పురుషుల టైటిల్‌ నెగ్గడం ద్వారా 3వ ర్యాంకుకు చేరుకున్నారు. వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ మంగళవారం డబుల్స్‌ ర్యాంకింగ్స్‌ ప్రకటించింది. గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న చిరాగ్‌-సాత్విక్‌ ఇప్పుడు మూడో ర్యాంకులో నిలిచారు.

ఇండోనేషియాకు చెందిన ఆర్డియాంటో, అల్ఫియాన్‌ ద్వయం అగ్రస్థానం దక్కించుకున్నారు. చైనా డబుల్స్‌ ప్లేయర్లు లియాంగ్‌, వాంగ్‌ రెండోర్యాంక్‌ సాధించారు. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ టాప్‌ 20లోకి వచ్చాడు. పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌, సాత్విక్‌ ద్వయం గతేడాది నుంచి నిలకడగా ఆడుతున్నారు. ఇటీవల ఇండోనేషియా ఓపెన్‌ డబుల్స్‌తోపాటు, స్విస్‌ ఓపెన్‌ టైటిల్‌ నిలబెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement