Tuesday, April 30, 2024

శ్రేయస్‌ అయ్యర్ కి ఎన్‌సీఏ క్లియరెన్స్‌.. ఐపీఎల్ కి రెడీ..

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. భుజం గాయం కారణంగా ఐపీఎలో మ్యాచ్ లకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌ సందర్భంగా శ్రేయస్‌ భుజానికి తీవ్ర గాయం కాగా అతడికి యూకేలో శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే శ్రేయస్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) అతడికి క్లియరెన్స్‌ ఇచ్చింది. బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో శ్రేయస్‌కు నిర్వహించిన మెడికల్‌, ఫిట్‌నెస్‌ పరీక్షల్లో అతడు అర్హత సాధించాడు. దీంతో అయ్యర్‌ మళ్లీ మైదానంలోకి దిగడానికి అర్హత పొందినట్టు ఎన్‌సీఏ తెలిపింది. ఎన్‌సీఏ తాజా నిర్ణయంతో శ్రేయస్‌.. త్వరలో దుబాయ్‌ వేదికగా జరుగనున్న ఐపీఎల్‌లో ఢిల్లీ తరఫున ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: మావోయిస్ట్ కీలక నేతల అరెస్ట్..

Advertisement

తాజా వార్తలు

Advertisement