Wednesday, May 1, 2024

మావోయిస్ట్ కీలక నేతల అరెస్ట్..

ఏవోబీలో ఆరుగురు మావోయిస్టుల కీలక నేతలను అరెస్టు చేశారు. ఏపీ, ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అయినవారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్‌మెన్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగతావారు ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. దీనిపై ఇవాళ మధ్యాహ్నం ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.. అదుపులోకి తీసుకున్న మావోయిస్టు కీలక నేతలను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక గత కొంత కాలంగా మావోయిస్టుల కోసం నిరంతరం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.

ఇది కూడా చదవండి: కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తుమ్మల

Advertisement

తాజా వార్తలు

Advertisement