Sunday, April 28, 2024

Punjab Kings : శిఖ‌ర్ కు గాయం… రెండు మ్యాచ్ ల‌కు దూరం

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో వరుసగా చివరి రెండు మ్యాచుల్లో ఓడిన పంజాబ్‌ కింగ్స్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సారథి శిఖర్‌ ధావన్‌ భుజం గాయం కారణంగా తర్వాతి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని పంజాబ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ వెల్లడించాడు.

- Advertisement -

రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ చివరి నిమిషంలో తప్పుకున్నాడు. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో ధావన్‌కు మరికొన్ని రోజుల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరులతో జరిగే కీలక మ్యాచ్‌లకు ధావన్‌ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ శిఖర్‌ కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండక పోవడం పంజాబ్‌కు పెద్ద ఎదురుదెబ్బే.

Advertisement

తాజా వార్తలు

Advertisement