Sunday, April 28, 2024

Preetijinta : అత‌డిని ఎంత‌కైనా కొంటా

పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతీ జింటా సంచలన వ్యాఖ్యలు చేసింది. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వస్తే అతన్ని తీసుకునేందుకు తన జీవితాన్నే పణంగా పెడుతానని తెలిపింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

- Advertisement -

తమ జట్టు వరుస పరాజయాలతో తీవ్ర నిరాశకు గురైన ప్రీతీ జింటా.. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.తమ జట్టుకు నిలకడగా ఆడుతూ.. ఛాంపియన్ మైండ్ సెట్ కలిగిన కెప్టెన్ అవసరం ఉందని ప్రీతీ జింటా అభిప్రాయపడింది. వచ్చే ఏడాది జరిగే మెగా వేలంలోకి రోహిత్ శర్మ వస్తే.. అతన్ని తీసుకునేందుకు తన జీవితాన్నే బెట్ కాస్తానని తెలిపింది. ‘రోహిత్ శర్మ మెగా వేలంలోకి వస్తే అతన్ని కొనుగోలు చేసేందుకు నా సర్వస్వం బెట్ కాస్తాను. జట్టులో నిలకడను తీసుకురావడంతో పాటు ఛాంపియన్ మైండ్ సెట్ కలిగిన సారథిని మేం మిస్సవుతున్నాం.’అని తెలిపింది.

ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి తనను తప్పించడంపై రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నాడనే, ఆ జట్టును వీడాలనుకుంటున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే రోహిత్ శర్మ కోసం తాము ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు చెప్పాయి. ఐపీఎల్ 2024 సీజన్‌లో 6 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచింది. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లో విజయం ముంగిట బోల్తా పడింది. తమ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయంతో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో సామ్ కరణ్ జట్టును నడిపించాడు. అయితే శిఖర్ ధావన్ మరో వారం రోజుల పాటు ఆడలేడని ఆ జట్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement