Monday, April 29, 2024

వైరల్ అవుతోన్న – 16జట్లకి చెందిన కేప్టెన్స్ సెల్ఫీ

16జట్లకి చెందిన కేప్టెన్స్ సెల్ఫీ దిగారు.ఆసీస్‌ కెప్టెన్‌ ఫించ్‌ తీసిన సెల్ఫీ ఫోటోను కడా ఐసీసీ ట్వీట్‌ చేసింది. కాగా టీ20 వరల్డ్‌కప్‌కు అంతా రెఢీ అయ్యింది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఆ టోర్నీలో సూపర్‌12 స్టేజ్‌ అక్టోబర్‌ 22 నుంచి ప్రారంభంకానున్నది. తొలి మ్యాచ్‌లో ఆసీస్, కివీస్‌ తలపడనున్నాయి. ఇక అక్టోబర్‌ 23న జరిగే దాయాది సమరంలో ఇండియా, పాక్‌ పోటీపడనున్నాయి. అయితే ఇవాళ టోర్నీలో పాల్గొంటున్న 16 జట్లకు చెందిన కెప్టెన్లతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. కెప్టెన్స్‌ డే పేరుతో జరిగిన ఈవెంట్‌లో ఆ కెప్టెన్లు అంతా మీడియాతో మాట్లాడారు. నవంబర్‌ 13వ తేదీన టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్ జరగనున్నది. ఆ ఫైనల్లో గెలిచిన జట్టు 1.6 మిలియన్ల డాలర్లు సొంతం చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, ఇండియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, సౌతాఫ్రికాలు తమ మ్యాచ్‌లను సూపర్‌ 12 స్టేజ్‌ నుంచి ప్రారంభించనున్నాయి.
ఫస్ట్‌ రౌండ్‌లో నమీబియా, నెదర్లాండ్స్‌, శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్‌, స్కాట్‌లాండ్‌, వెస్టిండీస్‌, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement