Tuesday, May 7, 2024

టీడీపీ, జనసేనను ఉత్తరాంధ్ర ప్రజలు బ్యాన్ చేయాలి.. కొడాలి నాని

టీడీపీ, జనసేన పార్టీలను ఉత్తరాంధ్ర ప్రజలు బ్యాన్ చేయాలని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన విశాఖ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ… రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి ఉద్యమమని అన్నారు. ఒక్క అమరావతిలోనే టీడీపీ ఉందా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. వర్షంలోనూ వికేంద్రీకరణ ఆకాంక్షను ప్రజలు తెలిపారన్నారు. మూడు ప్రాంతాల డెవలప్ మెంట్ చేయాలనేది తమ లక్ష్యమన్నారు. ఒక ప్రాంతమే డెవలప్ మెంట్ అయితే విద్వేషాలు పెరుగుతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement