ప్రభన్యూస్: కేరళలోని యువ ఫుట్బాలర్ ఆదర్శ్ మన్నార్లోని కుట్టంపెరూర్లో డిగ్రీ చదువుతున్నాడు. చిన్ననాటి నుంచి ఫుట్బాల్ ఆటపై ఇన్ట్రెస్ట్తో వివిధ టోర్నీల్లో తన ప్రతిభ నిరూపించుకున్నాడు. స్పానిష్ ఫుట్బాల్ జట్టు సీడీ లా విర్జెన్ డెల్ కామినోతో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యాడు ఆదర్శ్. నెలరోజుల పాటు జరుగనున్నఈ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ కోసం అతడు స్పెయిన్ వెళ్లాల్సి ఉంది.
అందుకు తగిన ఆర్థిక స్థోమత లేకపోవడంతో చెంగనూర్ ఎమ్మెల్యే, క్రీడా శాఖా మంత్రిని ఆశ్రయించాడు ఆదర్శ్. తన స్పెయిన్ ట్రిప్పునకు నిధులు సమకూర్చాల్సిందిగా కోరాగా, మంత్రి చెరియన్ తనతో ఉన్న ఆదర్శ్ ఫోటోను షోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.
ఆ పోస్టును చూసి స్పందించాడు సంజూ శాంసన్, ఆదర్శ్ ప్రయాణానికి కావాల్సిన విమాన టిక్కెట్ల కొనుగోలు బాధ్యతను తీసుకుంటున్నట్లు తెలియచెశాడు సంజూ. మరోవైపు ఆదర్శ్ ఖర్చుల కోసం 50 వేల రూపాయలు జమచేస్తున్నట్టు కరకోడే లియో క్లబ్ తెలియచేసంది.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily