Monday, April 29, 2024

ఆర్సీబీ ఫ్యాన్స్ ఖండకావరం – గిల్ సోదరి పై అశ్లీల కామెంట్స్

న్యూ ఢిల్లీ – ఐపీఎల్‌-2023లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. ప్లే ఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి అజేయ సెంచరీతో మెరిసినా.. లక్ష్య ఛేదనలో గిల్‌ శతకంతో రాణించి గుజరాత్‌ను గెలిపించాడు. దీంతో ఆర్సీబీ కనీసం ప్లే ఆఫ్స్‌ కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో బెంగళూరు ఓటమిని జీర్ణించుకోలేని కొందరు ‘దురభిమానులు’ శుబ్‌మన్‌ గిల్‌తో పాటు అతడి సోదరి షానిల్‌ను కూడా టార్గెట్‌ చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు..

ఈ విషయంపై స్పందించిన స్వాతి మలివాల్‌.. గిల్‌, షానిల్‌లపై వస్తున్న ట్రోల్స్‌ స్క్రీన్‌ షాట్స్‌ షేర్‌ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ”వాళ్లు చూసిన ఓ మ్యాచ్‌లో తమకిష్టమైన జట్టు ఓడిపోయిందని శుబ్‌మన్‌ గిల్‌ సోదరిని అబ్యూజ్‌ చేయడం నిజంగా సిగ్గుచేటు.చర్యలు తీసుకుంటాంగతంలో విరాట్‌ కోహ్లి కూతురి పట్ల కూడా ఇలాగే ప్రవర్తించారు. ఢిల్లీ మహిళా కమిషన్‌ ఇలాంటివి చూస్తూ ఊరుకోదు. గిల్‌ సోదరిని కించపరిచేలా మాట్లాడిన వాళ్లపై తప్పక చర్యలు తీసుకుంటాం” అని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement