Monday, April 29, 2024

రాహుల్ ద్రావిడ్ కి అనారోగ్యం.. చివ‌రి వ‌న్డేకు దూరం

నిన్న కోల్ క‌తాలో శ్రీలంక‌తో జ‌రిగిన రెండో వ‌న్డేకు అనారోగ్యంతోనే సేవ‌లందించారు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నారు. శుక్ర‌వారం కోల్ కతా నుంచి బెంగళూరుకు విమానంలో బయల్దేరారు. అనారోగ్యం నేపథ్యంలో తిరువనంతపురంలో జరిగే చివరి వన్డేకు ద్రావిడ్ అందుబాటులో ఉండరు. మరోవైపు శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రమైన మూడో వన్డేలో కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో భారత్ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement