Wednesday, April 17, 2024

న‌ష్టాల‌కు బ్రేక్…లాభాల భాట‌లో స్టాక్ మార్కెట్..

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. వరుసగా మూడు సెషన్ల నష్టాల తరువాత సూచీలు వారాంతంలో లాభాల బాట ప‌ట్టాయి.. సెన్సెక్స్‌ 303 పాయింట్లతో 60,261, నిఫ్టీ 98 పాయింట్ల పెరుగుద‌ల‌తో 17,957 వద్ద స్థిరపడ్డాయి.నేటి మార్కెట్ లో ఫైనాన్షియల్‌, ఐటీ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌టెక్‌ క్యూ 3 త్రైమాసిక ఫలితాల్లో మెరుగ్గా ఉన్నాయి. దీంతో ఇన్ఫో షేర్లు బాగా లాభపడ్డాయి. ఇంకా అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌, టాటా స్టీల్‌, బీపీసీఎల్‌ టాప్‌ విన్నర్స్‌గా, టైటన్‌, అపోలో హాస్పిటల్‌, ఎస్‌బీఐ లైఫ్‌,నెస్లే ఇండియా ,లార్సెన్ అండ్ టుబ్రో ఐటీసీ స్ప‌ల్ప నష్టాల‌ను మూట‌క‌ట్టుకున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement