Sunday, April 28, 2024

సీఎం కేసీఆర్ సభకు పెద్ద సంఖ్యలో తరలిరండి : ఎంపీ రవిచంద్ర

ఖమ్మంలో ఈనెల 18వ తేదీన జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలి రావలసిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గులాబీ శ్రేణులు, ప్రజలను కోరారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం ఆ పక్కనే జరిగే భారీ బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఎంపీ రవిచంద్ర తెలిపారు. ఈ సభను విజయవంతం చేయడంలో భాగంగా జన సమీకరణ కోసం ఆయన శుక్రవారం చింతకాని మండలం వందనంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్ధిరాజు మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు నారపోగు వెంకటేశ్వర్లు, సర్పంచ్ కోరేపల్లి సునీత, ఉప సర్పంచ్ షేక్ ఖధీర్ బాబు, మాజీ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు తదితర ప్రముఖులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేరళ, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజయన్, భగవంత్ సింగ్ మాన్, అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొనే ఈ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా ఎంపీ వారిని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement