Friday, March 29, 2024

ఢిల్లీ హిట్ అండ్ డ్రాగ్ కేసు.. 11 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు

ఢిల్లీ హిట్ అండ్ డ్రాగ్ కేసులో 11మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. న్యూ ఇయర్ రోజున ఢిల్లీ శివారులో ఓ యువతికి జరిగిన కారు ప్రమాద ఘటనపై కేంద్రం ఫైర్ అయింది. ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ ఈ కేసుకు సంబంధించి 11 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఘటన జరిగిన రోజు కారు ప్రయాణించిన రూట్లలో గస్తీ తిరుగుతున్న మూడు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వ్యాన్ల సిబ్బందితోపాటు రెండు పోలీస్‌ పికెట్స్‌ వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసింది. డీసీపీ స్థాయి అధికారి సహా 10 మందిని సస్పెండ్‌ చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. వారిపై శాఖాపరమైన విచారణ జరపాల్సిందిగా ఆదేశించింది. ఈ కేసులో నిందితులపై హత్యా నేరం మోపాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా ఛార్జిషీట్‌ దాఖలు చేయాల్సిందిగా దిల్లీ పోలీసు కమిషనర్‌ సంజయ్‌ అరోరాను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement