Saturday, April 27, 2024

Big Breaking | క్వాలిఫయర్​–2లోకి ముంబయి.. ఎల్లుండి గుజరాత్​తో పోటీ

ఐపీఎల్​ ఎలిమినేటర్​ గేమ్​లో ఇవ్వాల (బుధవారం) లక్నోపై ముంబయి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబయి నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేయగలిగింది. కాగా, 183 పరుగుల టార్గెట్​తో బరిలోకి దిగిన లక్నో జట్టు.. మొదటి నుంచి నెమ్మదిగా ఆడుతూ వచ్చింది. ఇక.. ముంబయి బౌలర్లు విజృంభించడంతో వరుసగా వికెట్లను పోగొట్టుకుని 15 ఓవర్లలోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 16వ ఓవర్​లో 101 పరుగులు 9 వికెట్ల నష్టంతో టెయిలెండర్లు నవీన్​ ఉల్​ హక్​, ఎం ఖాన్​ పోరాడారు. 16.3 ఓవర్లకే మొత్తం పది వికెట్లు పోగొట్టుకుని లక్నో దారుణంగా ఓటమి చెందింది. ఇక.. ముంబయి 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్​ –2లోకి ఎంటర్​ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement