Friday, April 26, 2024

ఆలిండియా క్రికెట్ టోర్నీలో ఎమ్మెల్యే గువ్వల సత్తా.. 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కైవసం

అచ్చంపేట, రూరల్ (ప్రభన్యూస్): తెలంగాణలోని అచ్చంపేట పట్టణంలో జరుగుతున్న ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ లో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు క్రీడాకారుడిగా తన సత్తా చాటారు. ఆదివారం అచ్చంపేట స్టేడియంలో మహరాష్ట్ర,  ఆర్ఫాన్ సీసీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆర్ఫాన్ సీసీ జట్టులో సభ్యుడిగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆడారు. ఈ మ్యాచ్ లో 16 బంతులు వేసి 21పరుగులు మాత్రము ఇచ్చి.. 4 వికెట్లు తీశారు బాలరాజు. దీంతో  మ్యాచ్ ను మలుపు తిప్పారు.

గువ్వల బాలరాజు బౌలింగ్ లో రాణించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కైవసం చేసుకున్నారు. ఎమ్మెల్యేగా నిత్యం ప్రజా సమస్యల్లో బిజీగా ఉంటూనే మరోవైపు క్రిడాకారుడిగా తనదైనశైలిలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. క్రిడాకారుడిగా ఎమ్మెల్యే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందడంతో ఇతర క్రీడాకారులు అభినందించారు. ఈ టోర్నమెంట్ లో ఎమ్మెల్యే బాలరాజు ఆడిన మూడు మ్యాచ్ లలో ప్రతి మ్యాచ్ లో రెండు వికెట్ల చొప్పున తీసి ఆదివారం జరిగిన మ్యాచ్ లో 4 వికెట్లతో మొత్తం 8 వికెట్లు తీయడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement