Tuesday, April 23, 2024

రైతన్నల గుండెల్లో దేవుడు సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి

యాదాద్రి, ప్రభన్యూస్ : రైతన్నల గుండెల్లో దేవుడిగా సీఎం కేసీఆర్ నిలిచాడని ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శనివారం యదాద్రిభువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం వెంకీర్యాలలో రైతుబంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణలో పండుగలా రైతుబంధు వారోత్సవాలు జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు, రైతన్నలకు గౌరవం దక్కించిన ఏకైక ప్రభుత్వం టీఆరెస్ అని అన్నారు, రైతన్నలను లక్షాధికారులను చెయ్యడమే లక్ష్యంగా రాష్ట్రంలో అనేక రైతు సంస్కరణలను సీఎం తీసుకొచ్చారన్నారు.అంతకుముందు గ్రామంలో ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీ నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement