Friday, April 26, 2024

Big Breaking | డిసైడింగ్​ మ్యాచ్​లో కోహ్లీ సెంచరీ.. గుజరాత్​ టార్గెట్​ ఎంతంటే?

ప్లే ఆఫ్స్​ రేసులో భాగంగా ఇవ్వాల గుజరాత్​తో జరిగిన మ్యాచ్​లో కింగ్​ కోహ్లీ సెంచరీతో అలరించాడు. బెంగళూరు జట్టుకు ఇది డిసైడింగ్​ మ్యాచ్​ కావడం, తప్పక గెలవాల్సి ఉండడంతో కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. తొలుత టాస్​ గెలిచిన గుజరాత్​ బౌలింగ్​ తీసుకుంది. బ్యాటింగ్​కు దిగిన డుప్లిసీ, కోహ్లీ ఆది నుంచి దంచికొట్టారు. అయితే.. మిడిల్​ ఓవర్లలో త్వరత్వరగా వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న జట్టును కోహ్లీ ఆదుకున్నాడు. ఇక.. ఈ మ్యాచ్​లో దినేష్​ కార్తీక్​ డక్​ అవుటయ్యాడు. అతనికి ఇది 17వ డక్​ అవుట్​ కావడం విశేషం..

నిర్ణీత ఓవర్లలో బెంగళూరు జట్టు 197 పరుగులు చేసింది. ఇక.. గుజరాత్​ జట్టు 198 పరుగుల టార్గెట్​తో చేజింగ్​కు రానుంది. కాగా, 61 బంతుల్లో కోహ్లీ 101* పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. డూప్లిసెస్​ (28), మ్యాక్స్​వెల్​ (11), లాంబ్రో (1), బ్రేస్​వెల్​ (26), దినేశ్​ కార్తీక్​ (0), అనుజ్​ రావత్​ 23 నాటౌట్​..

ఇక.. మహ్మద్​ శమీ, దయాల్​, రశీద్​ ఖాన్​ తలా ఒక వికెట్​ తీయగా.. నూర్​ అహ్మద్​ రెండు వికెట్లు పడగొట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement