Tuesday, May 7, 2024

మెయిన్ జంక్ష‌న్ ల‌లో రాతి జింకలు.. పీవీ మార్గ్‌, ఖైరతాబాద్‌ వద్ద ఏర్పాటు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద కూడళ్లను అందంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వివిధ రూపాలతో కూడిన వాటిని ఏర్పాటు చేస్తున్నారు. జింక ఆకారంతో చెక్కిన 8 రాతి ఆకృతులు పలు కూడళ్లలో అమర్చారు. పీవీ నర్సింహరావు మార్గ్‌లో రెండు, ఖైరతాబాద్‌ ప్లై ఓవర్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వైపు వెళ్లే దారిలో రెండింటిని ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఒకే రాతితో చెక్కబడినట్లుగా మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement