Saturday, May 4, 2024

IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లీ? ఇంకా ప్రకటించని యాజమాన్యం

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్‌గా మళ్లీ కోహ్లీ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. 2021 టీ20 ప్రపంచకప్‌ జరుగుతున్న సమయంలో కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అనంతరం కోహ్లీ వన్డే, టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై దూరమయ్యాడు. కొత్త కెప్టెన్‌ ఎవరనేది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యాజమాన్యం ఇంకా ప్రకటించలేదు. ఈనేపథ్యంలో డుప్లెసిస్‌ పేరు తెరపైకి వచ్చినా ఆర్సీబీ అధికారికంగా ప్రకటించలేదు.

రేపు ఆర్సీబీ యాజమాన్యం తమ కెప్టెన్‌ ఎవరనేది ప్రకటించనుంది. కోహ్లీనే మళ్లీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని సమాచారం. 2013నుంచి 2021వరకు ఆర్సీబీకి కెప్టెన్‌గా కోహ్లీ వ్యవహరించాడు. కెప్టెన్‌గా ఉండేందుకు కోహ్లీ అంగీకరించకపోతే డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌, దినేశ్‌ కార్తీక్‌ కెప్టెన్సీ కోసం పోటీ పడనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement