Friday, May 3, 2024

IPL 2022: ఆర్చర్‌ ప్రాక్టీస్‌ షురూ.. గాయం నుంచి కోలుకున్న ముంబై ప్లేయర్​

ఐపీఎల్‌ 2022లో ముంబై ఇండియన్స్‌ తరఫున జోఫ్రా ఆర్చర్‌ ఆడే అవకాశం ఉంది. ఈ నెల 26 నుంచి మెగాటోర్నీ ఆరంభం కానుంది. ఆర్చర్‌ను మెగావేలంలో ముంబై ఇండియన్స్‌ జట్టు సొంతం చేసుకుంది. అయితే గాయంతో ఆర్చర్‌ తాజా సీజన్‌లో ఆడడని ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం భావించింది. కానీ ఆర్చర్‌ గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఆర్చర్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది.

ఐపీఎల్‌ 15వ సీజన్‌లో ఆర్చర్‌ ఆడేది లేనిది ముంబై జట్టు యాజమాన్యం స్పష్టతనివ్వలేదు. కాగా ఐపీఎల్‌ రెండో దశ మ్యాచ్‌లకు ఆర్చర్‌ అందుబాటులో ఉంటాడని సమాచారం. ఐపీఎల్‌ మెగావేలంలో ముంబై ఇండియన్స్‌ ఆర్చర్‌ను రూ.8కోట్లుకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 35మ్యాచ్‌లు ఆడిన ఆర్చర్‌ 46వికెట్లు తీశాడు. గత సీజన్‌లో ఆర్చర్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement