Wednesday, April 24, 2024

Cricket: పాక్‌ జట్టులో కరోనా కలకలం.. రేపటి నుంచి పాక్​ ఆస్ట్రేలియా సెకండ్​ టెస్ట్​

ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ముంగిట పాకిస్థాన్‌ జట్టులో కరోనా కలకలం రేపింది. పాక్‌ ఆల్‌రౌండర్‌ ఫహీమ్‌ అష్రాఫ్‌ కరోనా బారిన పడ్డాడు. దీంతో కరాచీ వేదికగా రేపటి నుంచి జరగనున్న పాక్‌-ఆస్ట్రేలియా రెండో టెస్టుకు ఫహీమ్‌ దూరంకానున్నాడు. ఫహీమ్‌ను ఐసోలేషన్‌కు తరలించినట్లు పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తెలిపింది. అంతకుముందు పాక్‌ పేసర్‌ హరీస్‌ రవూఫ్‌ కూడా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. కాగా 24ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పాక్‌ గడ్డపై అడుగుపెట్టిన ఆసీస్‌ మూడుటెస్టులుతోపాటు మూడు వన్డేలు, ఓ టీ20 ఆడనుంది. తొలి టెస్టు రావల్పిండి వేదికగా జరగగా డ్రాగా ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement