Saturday, May 11, 2024

ఇండియా గెలిచిందోచ్‌.. ఎవ‌రిపైనంటే..

టీమిండియా, ఆఫ్గాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో 66 ప‌రుగుల భారీ విజ‌యాన్ని ఇండియా సొంతం చేసుకుంది, టీమిండియా 210 ప‌రుగులు చేయ‌గా.. 20 ఓవ‌ర్ల‌లో ఆఫ్గాన్ జ‌ట్టు 144 పరుగుల‌కే చ‌తికిల‌ప‌డింది. తొలి రెండు మ్యాచ్‌ల‌లో ఓట‌మి చెందిన ఇండియా ఈ మ్యాచ్‌లో అల‌వోక విజ‌యాన్ని అందుకుంది. ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్‌గా రోహిత్ శ‌ర్మ‌నిలిచారు.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా న్యూజిలాండ్‌, స్కాంట్‌లాండ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విన్ అయ్యింది. సూప‌ర్ గ్రూప్ 12లో భాగంగా గ్రూపు 2లోని ఈ రెండు టీమ్‌ల మ‌ధ్య ఉత్కంఠ‌గా మ్యాచ్ జ‌రిగింది. చివ‌రికి 16 ప‌రుగుల తేడాతో న్యూజీలాండ్ జ‌ట్టు విజ‌యం సాధించింది. కాగా, ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్‌గా మార్టిన్ గుఫ్తిల్ నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement