Tuesday, May 7, 2024

Ind vs Eng : లంచ్ బ్రేక్… ఇంగ్లండ్ స్కోర్ 290/5

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది.

ఇంగ్లండ్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి.. 35ఓవర్లలో 207 పరుగులు చేయగా, మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. ఇవాళ ఆట ప్రారంభించినప్పటి నుంచి భారత్ జట్టు మరో మూడు వికెట్లు తీసింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ డకెట్ 153 పరుగులు చేసి ఔట్ కాగా, బెన్ స్టోక్స్ 39 పరుగులు, బెన్ ఫోక్స్ 6 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement