Monday, April 29, 2024

Ind vs Eng, 5th Test : ముగిసిన మొదటిరోజు ఆట.. భారత్ స్కోరు 135/1

ధర్మశాలలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు 218 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత భారత్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది.

భారత్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు. దీంతో ఇంగ్లండ్ జట్లు 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆతర్వాత భారత్ జట్టు బ్యాట్స్ మెన్ యశస్వీ జైస్వాల్ 57 పరుగులు చేసి బషీర్ బౌలింగ్ లో ఫోక్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ రోహిత్ శర్మ 52 పరుగులు, శుభమాన్ గిల్ 26 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement