Saturday, April 27, 2024

EBC : సాత్విక్ జోడి శుభారంభం ..

ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి (భారత్‌) శుభారంభం చేసింది. గ‌త రాత్రి జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ జంట సాత్విక్‌-చిరాగ్‌ 21-18, 21-14తో 2019 చాంపియన్‌ జోడీ మొహమ్మద్‌ అసన్‌-హెండ్రా సెతియావాన్‌ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 2022 విజేత జోడీ మొహమ్మద్‌ షోహిబుల్‌ ఫిక్రి-బగాస్‌ మౌలానా (ఇండోనేసియా)తో సాత్విక్‌-చిరాగ్‌ ద్వయం తలపడుతుంది.

లక్ష్య సేన్‌ బోణీ
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో 2022 రన్నరప్, భారత స్టార్‌ లక్ష్య సేన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 21-14, 21-14తో ప్రపంచ 33వ ర్యాంకర్‌ మాగ్నస్‌ జొహాన్సన్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించాడు. మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో భారత ప్లేయర్‌ ప్రియాన్షు రజావత్‌కు నిరాశ ఎదురైంది. చికో ఔరా ద్వి వర్దాయో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రియాన్షు 19-21, 21-11, 9-21తో ఓడిపోయాడు.

- Advertisement -

అశ్విని ముందంజ‌… గాయ‌త్రికి నిరాశ
మహిళల డబుల్స్‌ విభాగంలో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (భారత్‌) జోడీ ముందంజ వేయగా… గత ఏడాది సెమీఫైనల్‌ చేరిన పుల్లెల గాయత్రి-ట్రెసా జాలీ (భారత్‌) జంట ఈసారి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. అశి్వని-తనీషా ద్వయం 21-13, 21-18తో యెంగ్‌ ఎన్గా టింగ్‌-యెంగ్‌ పుయ్‌ లామ్‌ (హాంకాంగ్‌) జోడీపై నెగ్గింది. గాయత్రి-ట్రెసా జోడీ 18-21, 12-21తో అప్రియాని రహాయు-సితీ ఫాదియా (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement