Tuesday, April 30, 2024

Breaking: స‌ఫారీల‌తో ఇవ్వాల‌ తొలి టీ20.. కోహ్లీపై అభిమానం, తిరువనంతపురంలో నిలువెత్తు క‌టౌట్ !

టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దేశంలో ఎక్కడకు వెళ్లినా కోహ్లీ ఫ్యాన్స్ ర‌చ్చ చేస్తూ అంతే జోష్‌గా ఉంటారు. ఇప్పుడు కేరళ రాజధాని తిరువనంతపురంలో కోహ్లీ క‌టౌట్ పెట్టి ర‌చ్చ రంబోలా చేస్తున్నారు. సౌతాఫ్రికాతో జరిగే తొలి టీ20 మ్యాచ్ కోసం భారత జట్టు అక్క‌డికి చేరుకుంది. ఇవ్వాల (బుధవారం) సాయంత్రం ఇక్కడ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా వచ్చింది.

ఈ క్రమంలో మ్యాచ్ జరిగే గ్రీన్‌ఫీల్డ్ క్రికెట్ స్టేడియం ఎదురుగా విరాట్ కోహ్లీ లైఫ్ సైజ్ కటౌట్ ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. కొత్త సినిమాలు రిలీజైనప్పుడు హీరోలకు పెట్టినట్లు కోహ్లీకి కటౌట్ పెట్టిన ‘ఆల్ కేరళ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్’ (ఏకేవీకేఎఫ్).. దీనికి సంబంధించిన ఫొటోను తమ ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసింది. దీంతో నెట్టింట ఈ కటౌట్ తెగ వైరల్ అవుతోంది. ఇక‌.. మ‌రికాసేప‌ట్లో సౌతాఫ్రికాతో టీమిండియా టీ20 ప్రారంభం కానుండ‌డంతో క్రికెట్ ప్రేమికులు సంద‌డి చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement