Saturday, April 27, 2024

IPL | చెలరేగిన చెన్నై.. బెంగళూరు టార్గెట్​ ఎంతంటే?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవ్వాల (సోమవారం) రాత్రి చెన్నై, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్​ జరుగుతోంది. తొలుత టాస్​ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్​ ఎంచుకుంది. బ్యాటింగ్​కు దిగిన ధోనీ సేన చెలరేగి ఆడడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది.

ఇందులో.. కాన్వే (83), రహానే (37), శివం దూబే (52) పరుగులతో అభిమానులకు అలరించారు. సిక్స్​లు, ఫోర్లతో మోత మోగించారు. దీంతో చెన్నై పటిష్టమైన ‌226 పరుగుల స్కోరుని చేయగలిగింది.. ఇక.. సిరాజ్​, పార్నెల్​, విజయ్​కుమార్​, హసరంగా, హర్షల్​ పటేల్​కు తలా ఒక వికెట్​ దక్కింది.. కాగా, బెంగళూరు టార్గెట్​ 227 పరుగులుగా ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement