Wednesday, May 15, 2024

Cricket: దాయాదుల పోరు.. 200 దేశాల్లో లైవ్ స్ట్రీమింగ్‌

టీ20లో మొద‌టిసారి ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌ర‌గ‌నుంది. ఈ రోజు దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై ఈ రెండు దేశాలు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం దృష్టి నిలిచింది. ప్రపంచంలోని 200 దేశాల్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరగడానికి కారణం ఇదే.

ఇప్పటి వరకు 8 టీ 20 మ్యాచ్‌లు పాకిస్థాన్ ఇండియా మధ్య జరిగాయి. ఇందులో టీమ్ ఇండియా ఏడు మ్యాచ్‌లు గెలిచింది. ప్రపంచకప్‌లో ప్రతిసారీ పాకిస్తాన్ ఓటమి చవిచూడాల్సి వస్తోంది. ఈ రోజు రెండు జట్లు రెండేళ్ల తర్వాత త‌ల‌ప‌డుతున్నాయి.

2019 లో వన్డే వరల్డ్ కప్‌లో చివరిసారిగా భారత్‌, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ పాకిస్థాన్‌ను భారీ తేడాతో ఓడించింది. భారత్ తమ రెండు వార్మప్ మ్యాచ్‌లలో విజయం సాధించింది. తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీం ఇండియా విజయం సాధించింది.

పాక్ జట్టు ఒక మ్యాచ్‌లో గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. విండీస్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. రెండు పొరుగు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత కారణంగా ఇరు జట్లు పరస్పరం ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement