Thursday, May 2, 2024

లారీని ఢీకొని.. స్కూటరిస్టు దుర్మరణం

Nellore, Pellakuru: నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని కొత్తూరు వద్ద 71వ జాతీయ రహదారిపై ఆదివారం యాక్సిడెంట్ జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని స్కూటర్ ఢీకొనడంతో ఒకరు చనిపోయారు. మరొకరికి గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సున్నపురాల అరుంధతి కాలానికి చెందిన మొద్దు రవి (52), రత్నమ్మ దంపతులు నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తికి బైక్ పై వెళ్తున్నారు. పెళ్లకూరు మండలం కొత్తూరు వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నారు. దీంతో మొద్దు రవి తలకు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే చనిపోయాడు.. ఆయన భార్య రత్నమ్మకు స్వల్ప గాయలయ్యాయి. ఆమెను 108 వాహనం ద్వారా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement