Friday, April 26, 2024

Breaking : మూడేళ్ల త‌ర్వాత సెంచ‌రీ కొట్టిన.. విరాట్ కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం సాధించే దిశగా టీమిండియా దూసుకెళ్తోంది. ఓపెనర్ శుబ్ మన్ గిల్ శతకంతో వేసిన పునాదిపై సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. మూడేళ్ల తర్వాత కోహ్లీ సెంచరీ అందుకున్నాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆదివారం, నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 289/3తో ఆట కొనసాగించిన భారత్ 362/4 స్కోరుతో లంచ్ బ్రేక్ కు వెళ్లింది. స్కోరు 300 దాటిన కాసేపటికే ఓవర్ నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా (28)ను ఖవాజా క్యాచ్ ద్వారా మర్ఫీ పెవిలియన్ చేర్చాడు. ఎట్ట‌కేల‌కు కోహ్లీ సెంచ‌రీని పూర్తి చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement