Tuesday, May 14, 2024

Breaking: బర్మింగ్​హామ్​ టీ20.. ఇంగ్లండ్​పై ఇండియా 49 ప‌రుగుల‌ విజయం..

భారత్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్​పై భారత్​ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​ చేసిన ఇండియా 170 ప‌రుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. కాగా, ఇంగ్లండ్ 121 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. దీంతో 49 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్ మీద ఇండియా గెలిచింది.

అయితే.. బుమ్రా వేసిన 11వ ఓవర్లో శామ్ కర్రాన్ (2) అవుటయ్యాడు. బుమ్రా వేసిన బంతిని మిడాఫ్ మీదుగా బౌండరీ తరలించేందుకు ప్రయత్నించిన కర్రాన్.. టైమింగ్ మిస్సయ్యాడు. దాంతో గాల్లోకి లేచిన బంతిని మిడాఫ్‌లో ఉన్న పాండ్యా వెనక్కు పరిగెడుతూ అందుకున్నాడు. ఆ తర్వాత కూడా చక్కగా బ్యాలెన్స్ నిలుపుకోవడంతో కర్రాన్ మైదానం వీడాడు. అంతకుముందు చాహల్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్ (19) కూడా అవుటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement