Tuesday, April 30, 2024

అక్టోబర్‌ 18న బీసీసీఐ ఎన్నికలు… 4వరకు నామినేషన్ల స్వీకరణ..!

బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా (బిసిసిఐ) ఎన్నికలు అక్టోబర్‌ 18న ముంబైలో జరగనున్నా యి. అడ్మినిస్ట్రేటర్‌లుగా వరుసగా రెండు మూడేళ్లపాటు కార్యాలయంలో ఉండేందుకు పార్లమెంటు సభ్యులు పోటీ చేసేందుకు అనుమతించిన సుప్రీంకోర్టు తీర్పు, ప్రస్తుత ఆఫీస్‌ బేరర్‌లను అర్హులుగా చేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అక్టోబర్‌ 18న ఎన్నికలు జరగనుండగా, అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. అక్టోబర్‌ 4 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, సెక్రటరీగా జైషా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో మహిళల ఐపిఎల్‌ను ప్రారంభించే ప్రణాళి కను బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి) అధ్యక్ష పదవికి భారత మాజీ కెప్టెన్‌ పోటీ చేసే అవకాశం కూడా ఉంది. 16 మంది సభ్యుల ఐసీసీ బోర్డులో గెలవాలంటే గంగూలీకి బిసిసిఐ మద్దతు అవసరం.

స్తుత చైర్మన్‌ గ్రెగ్‌ బార్కె తప్పుకోవాలంటే గంగూలీకి బీసీసీఐ అవసరం ఎంతైనా ఉంది. గత ఎన్నికల్లో బార్కెకి బీసీసీఐ మద్దతు ఇచ్చింది. సెక్రటరీ జేషా బోర్డులో కీలకమైన పదవిని చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. గంగూలీ స్థానంలో ఆయన అధ్యక్షుడిగా ఉంటారా? ”ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలు లేవు. అన్ని కీలకమైన పోస్టులను మళ్లి ఏకగ్రీవంగా భర్తీ చేయవచ్చు” అని సీనియర్‌ బోర్డు సభ్యుడు ఒకరు చెప్పారు. బీసీసీఐలో మరో రెం డు ముఖ్యమైన పదవులు ఉన్నాయి. అవి కోశాధికారి, ఐపిఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌. కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ మళ్లి కీలక పదవిని పొందవచ్చు. వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా తిరిగి ఎన్నిక కావచ్చు. ఐసీసీ సమావేశాల్లో బీసీసీఐ ప్రతినిధిని కూడా ఏజీఎం నిర్ణయిస్తుంది. ఏజీఎంలో ఓటు వేయనున్న రాష్ట్ర ప్రతినిధుల జాబితా త్వరలో వెలువడనుంది.

గంగూలీ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌కు ప్రాతినిద్యం వహిస్తున్న ఎజిఎంలో ఉంటారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళల ఐపిఎల్‌ ప్రారంభ ఎడిషన్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో నిర్వహించేందుకు బీసీసీఐ కృషి చేస్తోందని గంగూలీ తన లేఖలో రాశాడు. మహిళల టీ 20 ప్రపంచకప్‌ ఫిబ్రవరిలో ముగుస్తుంది. కాబట్టి మార్చి ప్రారంభ తేదీగా పరిగణించబడుతుంది.
”ఈ సీజన్‌ నుండి బాలికల అండర్‌ 15 వన్‌డే టోర్నమెంట్‌ను ప్రవేశపెట్టడం మాకు సంతోషంగా ఉంది” అని గంగూలీ అన్నారు. ఈ కొత్త టోర్నమెంట్‌ ద్వారా మన యువతులు జాతీయ అంతర్జాతీయలో ఆడేందుకు ఒక మార్గాన్ని సృష్టిస్తుంది” అని గంగూలీ చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement