Thursday, May 2, 2024

1st ODI : ఆసీస్ స్కోరు 276.. భారత్ టార్గెట్ 277

భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మొదటి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి… 276 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్ మెన్లు డేవిడ్ వార్నర్ 52 పరుగులు, జోష్ ఇంగ్లీస్ 45 పరుగులు, స్టీవెన్ స్మిత్ 41 పరుగులు, లబూషేన్ 39 పరుగులు, కామెరున్ గ్రీన్ 31 పరుగులు చేశారు. మార్కస్ స్టోయినిస్ 29 పరుగులు చేశారు. చివరి బంతికి జంపా రనౌట్ అయ్యాడు. భారత్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 277 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement