Friday, April 26, 2024

బెడ్‌పై నుంచే రోజా ఎన్నికల ప్రచారం

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెకు చెన్నైలో రెండు మేజ‌ర్ శ‌స్త్ర‌చికిత్స‌లు జ‌రిగాయి. అనంతరం ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయిన రోజా… తన ఆరోగ్య పరిస్థితి మరో వీడియో విడుదల చేశారు.

ఇటీవల తాను చేయించుకున్న సర్జరీల కారణంగా మరో నెల రోజులు నడవలేనని వీడియోలో తెలిపారు. కానీ పార్టీ కేడర్ కష్టపడి ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని బెడ్‌పై నుండి పిలుపునిస్తూ రోజా వీడియో విడుద‌ల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement