Thursday, May 9, 2024

రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.. డాక్టర్ చింతామోహన్

శ్రీకాళహస్తి … ఆంధ్ర రాష్ట్రానికి వనరులు ఇచ్చి ఆదుకోవడం చేశారని అలాంటి వారికి ఎందుకు ఓటు వేయాలని తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు కేంద్ర ప్రభుత్వం వద్ద కీలుబొమ్మలా వ్యవహరించి ప్ర‌జ‌ల‌ వద్దకు వచ్చేసరికి ప్రగల్భాలు పలుకుతున్నారని ఇకనైనా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. మంగళవారం ఉదయం రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు కూలి రవి కుమార్ తో పాటు పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆ రెండు పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టు అవుతుందని తెలిపారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తో దేశంలో మార్పు వస్తుందని అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మన్నవరం బెల్ ప్రాజెక్ట్, దుగ్గరాజుపట్నం వాడరేవు పనులు పూర్తయి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతుందని తెలిపారు.రెండో దఫా బిజెపి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులకు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల్ని చూపిస్తున్నారని. సామాన్యుడు నిత్యవసర వస్తువులు దొరకని పరిస్థితుల్లో ఉన్నాయని ఓవైపు పెట్రోల్ డీజిల్ ధరల రేట్లు మరోవైపు నిత్యవసర వస్తువులు ఇంకోవైపు ఇంటి పన్నులు టాక్స్లు పెంచుతూ పోతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.‌

Advertisement

తాజా వార్తలు

Advertisement