Sunday, April 28, 2024

వైఎస్ వివేకా హత్య కేసు.. కీల‌క సాక్షి గంగాధర్ రెడ్డి హఠాన్మరణం

ఏపీలో సంచల‌నంగా మారిన వైఎస్ వివేకానంద‌రెడ్డి మ‌ర్డ‌ర్ కేసులో కీల‌క సాక్షి గంగాధ‌ర్‌రెడ్డి అక‌స్మాత్తుగా చనిపోయాడు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన కల్లూరు గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో తనపై సీబీఐ అధికారులు ఒత్తిడి చేశారని గంగాధర్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశారు.

అంతేకాకుండా తనను వేధింపులకు గురి చేస్తున్నారని కూడా గంగాధ‌ర్ చెప్పారు. ఈ విషయమై ఎస్పీకి పిర్యాదు చేశారు. యాడికిలోని తన నివాసంలోనే గంగాధర్ రెడ్డి మరణించడం కలకలం రేపుతోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన సాక్షిగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement